ఎయిర్ ఇండియా విమానంలో ఒకే ఒక్క వలసదారుడి ప్రయాణం

- June 23, 2021 , by Maagulf
ఎయిర్ ఇండియా విమానంలో ఒకే ఒక్క వలసదారుడి ప్రయాణం

ఇండియా నుంచి యూఏఈకి ఓ విమానంలో ఒకే ఒక్క ప్రయాణీకుడు ప్రయాణించాడు. ఎస్.పి.సింగ్ ఒబెరాయ్ అనే ఓ వ్యాపారవేత్త పంజాబ్‌లోని అమ్రిత్‌సర్ నుంచి దుబాయ్‌కి ఎయిర్ ఇండియా విమానం ఎఐ929 ద్వారా బుధవారం ప్రయాణించారు. తన అడుగుల ద్వారా విమానం పొడవుని కొలిచినట్లు సింగ్ వెల్లడించారు. సింగ్, యూఏఈ గోల్డెన్ వీసా కలిగి వున్న వ్యక్తి. జూన్ 12న దుబాయ్‌కి వెళ్ళారాయన. గోల్డెన్ వీసా కలిగి వుండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయని ఆయన వివరించారు. ఏప్రిల్ 24 నుంచి ఇండియా నుంచి వచ్చే ప్రయాణీకులపై యూఏఈ తాత్కాలిక నిషేధం విధించింది కరోనా నేపథ్యంలో. కొన్ని వర్గాలకు చెందినవారికి మాత్రం మినహాయింపునిచ్చింది. గోల్డెన్ వీసా కలిగినవారికి, డిప్లమాటిక్ మిషన్స్‌పై వచ్చేవారు.. ఇలా కొందరికి వెసులుబాటు కల్పించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com