ఎయిర్ ఇండియా విమానంలో ఒకే ఒక్క వలసదారుడి ప్రయాణం
- June 23, 2021
ఇండియా నుంచి యూఏఈకి ఓ విమానంలో ఒకే ఒక్క ప్రయాణీకుడు ప్రయాణించాడు. ఎస్.పి.సింగ్ ఒబెరాయ్ అనే ఓ వ్యాపారవేత్త పంజాబ్లోని అమ్రిత్సర్ నుంచి దుబాయ్కి ఎయిర్ ఇండియా విమానం ఎఐ929 ద్వారా బుధవారం ప్రయాణించారు. తన అడుగుల ద్వారా విమానం పొడవుని కొలిచినట్లు సింగ్ వెల్లడించారు. సింగ్, యూఏఈ గోల్డెన్ వీసా కలిగి వున్న వ్యక్తి. జూన్ 12న దుబాయ్కి వెళ్ళారాయన. గోల్డెన్ వీసా కలిగి వుండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయని ఆయన వివరించారు. ఏప్రిల్ 24 నుంచి ఇండియా నుంచి వచ్చే ప్రయాణీకులపై యూఏఈ తాత్కాలిక నిషేధం విధించింది కరోనా నేపథ్యంలో. కొన్ని వర్గాలకు చెందినవారికి మాత్రం మినహాయింపునిచ్చింది. గోల్డెన్ వీసా కలిగినవారికి, డిప్లమాటిక్ మిషన్స్పై వచ్చేవారు.. ఇలా కొందరికి వెసులుబాటు కల్పించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







