అక్రమ శాటిలైట్ డిషెస్ తొలగింపుకు డెడ్లైన్
- March 08, 2016
sడిస్కవరీ గార్డెర్స్లో నివాసం ఉంటోన్నవారికి నఖీల్ మార్చ్ 10వ తేదీని డెడ్లైన్గా నిర్ణయించింది. వెంటనే అక్రమంగా ఏర్పాటు చేసిన శాటిలైట్ డిషెస్ లేదా యాంటినాస్ని రూఫ్స్ మరియు బాల్కనీల నుంచి తొలగించాలనీ, లేదంటే భారీగా జరీమానాలు విధింపబడ్తాయనీ నఖీల్ ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది. నఖీల్ ఫెసిలిటీస్ మరియు ఓనర్స్ అసోసియేషన్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి నోటీసులను జారీ చేసింది. 20,000 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్తో అతి పెద్ద కమ్యూనిటీగా ఉంది ఇది. అక్రమంగా డిష్లను ఏర్పాటు చేస్తే 500 దిర్హామ్ల వరకు ఫైన్ విధించే నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. 2015 మార్చ్లో అబుదాబీ మున్సిపాలిటీ 2000 దిర్హామ్ల ఫైన్ని అక్రమ డిష్లు వినియోగించేవారికి విధిస్తూ నిర్ణయం తీసుకుంది. షార్జాలో ఈ ఫైన్ 500 దిర్హామ్లుగా ఉంది. షార్జాలో 1997లోనే డిష్ యాంటెనాలపై నిషేధం ఉంది. 2012 నుంచి శాటిలైట్ టీవీ డిష్ల కోసం నిబంధనను సవరించి, కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









