భారత్ కరోనా అప్డేట్

- June 26, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో నిన్నటి రోజున 50 వేలకు పైగా కేసులు న‌మోదు కాగా, ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్‌ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో 48,698 కేసులు న‌మోద‌య్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,01,83,143 కి చేరింది.

ఇందులో 2,91,93,085 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,95,565 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనాతో 1,183 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 3,94,493 కి చేరింది. ఇక‌పోతే ఒక్క రోజులో 64,818 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com