జనసమూహానికి కారణమైన టూరిజం ఫెసిలిటీపై చట్టపరమైన చర్యలు

- June 26, 2021 , by Maagulf
జనసమూహానికి కారణమైన టూరిజం ఫెసిలిటీపై చట్టపరమైన చర్యలు

బహ్రెయిన్: ముహరాక్ ప్రాంతంలోని ఓ టూరిజం ఫెసిలిటీ, జన సమూహం ఏర్పటడానికి కారణమైనందున, ఆ సంస్థపై చర్యలకు ఉపక్రమించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. హెల్త్ మినిస్ట్రీ పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ఈ విషయాన్ని వెల్లడించింది.తగిన సమాచారంతో ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా, ఉల్లంఘనను గుర్తించారు.ఇంటీరియర్ మినిస్ట్రీ, బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్ అథారిటీతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు.ఓ చోట 15 మంది, మరో చోట 19 మంది గుమికూడి వున్నట్లు గుర్తించారు. మూడు విభాగాలకు చెందిన అధికారులు ఆ సంస్థపై తగిన చర్యలకు ఉపక్రమించారు.కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com