ఇళ్ళ నుంచి ఖాళీ చేయబడ్డ 8000 మంది వలస బ్యాచిలర్లు
- June 26, 2021
కువైట్ సిటీ: క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ తలాల్ అల్ ఖాలెద్ అల్ సబాహ్ మాట్లాడుతూ, భిల్డింగ్ ఉల్లంఘన నేపథ్యంలో 8,000 మంది వలస బ్యాచిలర్లను వారి ఇళ్ళ నుంచి ఖాళీ చేయించినట్లు తెలిపారు. బిల్డిం్ కోడ్స్ మరియు రెగ్యులేషన్లను, మరీ ముఖ్యంగా హెల్త్ నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు అల్ ఖాలెద్ పేర్కొన్నారు. వారి సివిల్ ఐడీలతో వారి వాస్తవ లివింగ్ సిట్యుయేషన్ సరి తూగలేదు. 206 భవనాల్లో 165 భవనాల్లో ఉల్లంఘనలు వెలుగు చూశాయి. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ ఉల్లంఘనలకు బాధ్యత వహించాలని గవర్నర్ పేర్కొన్నారు. కాగా, కార్మికుల కోసం ఆరు లేబర్ సిటీలను కువైట్ వ్యాప్తంగా నిర్మించనున్నట్లు మునిసిపాలిటీ 2016లో వెల్లడించింది. అల్ జ్రా లేబర్ సిటీ ప్రభుత్వ అలాగే ప్రైవేటు సెక్టార్ భాగస్వామ్యంతో నిర్మితమైంది. 2021లో ఇది పూర్తయ్యింది. 20,000కి పైగా కార్మికులు ఇక్కడ వుండే అవకాశముంది. 2017లోనే దీన్ని పూర్తి చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









