తెలంగాణ నుండి తిరుపతికి ప్రత్యేక విమాన ప్యాకేజీ
- June 27, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (TSTDC) తిరుపతికి ప్రత్యేక విమాన ప్యాకేజీని ప్రారంభించింది.రెండు రోజుల టూర్కు ఒక్కో వ్యక్తికి రూ.14,999 చార్జి చేయనున్నది. ప్యాకేజీలో భాగంగా తొలిరోజు ఉదయం 6 గంటలకు విమానం హైదరాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.అక్కడి నుంచి 8.45కు హోటల్కి వెళ్లి ఫ్రెష్ అయ్యాక ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్యలో తిరుమల స్వామివారి దర్శనం ఉంటుంది.దర్శనం పూర్తయ్యాక ఆకాశగంగ, పాపవినాశనం, జాపాలి, శిలాతోరణం, శ్రీవారి పాదాలు మొదలైన ప్రదేశాల సైట్ సీయింగ్కు తీసుకువెళ్తారు. ప్రదేశాల సందర్శన సమయంలోనే మధ్యాహ్న భోజనం పెడతారు. అన్ని ప్రదేశాలు తిరిగాక రాత్రి 8 గంటలకు తిరిగి హోటల్కు చేరుకుంటారు. 8.30కు రాత్రి భోజనం ఏర్పాటుచేస్తారు.రెండోరోజు ఉదయం 7 గంటల నుం చి 10.30 మధ్యలో కాణిపాకం, 11 నుంచి 12.30 మధ్యలో శ్రీనివాసమంగాపురం తీసుకెళ్తారు.మధ్యా హ్నం ఒంటి గంటకు హోటల్కు వచ్చి భోజనం చేసి 2.30 నుంచి 3.30 మధ్యలో పద్మావతి ఆలయం, 4 నుంచి 5 గంటల మధ్యలో శ్రీకాళహస్తి ఆలయానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఎయిర్పోర్టుకు తీసుకువచ్చి రెండోరోజు రాత్రి 9.30కు హైదరాబాద్కు చేరుకొనేలా ప్యాకేజీని రూపొందించారు.ఈ మేరకు ట్రూజెట్, స్పైస్జెట్తో ఒప్పందం చేసుకున్నామని టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







