మెట్రాష్2 యాప్ ప్రారంభం..మొబైల్లోనే డిజిటల్ డాక్యుమెంట్స్
- June 28, 2021
ఖతార్: డిజిటలైజేషన్ విజన్ లో భాగంగా ఖతార్ ప్రభుత్వం మెట్రాష్2 యాప్ తో ఈ-వాలెట్ సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మెట్రాష్ 2 యాప్ తో వ్యక్తిగత డాక్యుమెంట్లను మొబైల్ లోనే క్యారీ చేయవచ్చు. ఖతార్ గుర్తింపు కార్డు, రెసిడెన్సీ పర్మిట్ డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నెంబర్ ఓనర్ షిప్ ఇలా అన్ని వ్యక్తిగత ధృవ పత్రాలను ఒక్క క్లిక్ తో మీ అరచేతిలో ఉంటాయి. అవసరం అనుకుంటే డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ లో స్టోర్ చేసుకోవచ్చు. దీంతో అంతర్గత మంత్రిత్వ శాఖలో ఎలాంటి సేవలు పొందాలన్నా, అధికారులకు కావాల్సిన డాక్యుమెంట్లను చూపించాలన్నా మైట్రాష్ 2 యాప్ ఈ-వాలెట్ సర్వీస్ ద్వారా చూపించొచ్చు. పలు రకాల సేవల సమయంలోనూ ఈ-వాలెట్ లోని డాక్యుమెంట్ల ద్వారా పనులు చక్కబెట్టుకోవచ్చు. అలాగే ఒకవేళ భద్రతా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు డాక్యుమెంట్లను అడిగిన వెంటనే ఈ-వాలెట్ లోని డాక్యుమెంట్లను చూపించవచ్చు. అంటే మెట్రాష్ 2 యాప్ తో ప్రజలు ఫిజికల్ డాక్యుమెంట్లను క్యారీ చేయాల్సిన ప్రయాస తప్పుతుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







