భారత్ లో కరోనా కేసుల వివరాలు

- June 28, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ క్ర‌మంగా త‌గ్గుముఖం పడుతున్న‌ది.సెకండ్ వేవ్ కార‌ణంగా పెద్ద ఎత్తున్న కేసులు, మ‌ర‌ణాలు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.మూడు నెల‌ల త‌రువాత కేసులు అత్య‌ల్ప సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టం మంచి విష‌య‌మే.మ‌ర‌ణాల సంఖ్య కూడా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది.  

తాజాగా దేశంలో 46,148 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,02,79,331కి చేరింది.ఇందులో 2,93,09,607 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 5,72,994 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 979 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,96,730కి చేరింది.దేశంలో రిక‌వ‌రీ రేటు 96.80శాతంగా ఉన్న‌ది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com