రోజువారి ప్రయాణికుల సంఖ్యను 5000 పెంచే దిశగా ప్లానింగ్స్
- July 03, 2021
కువైట్: రాబోయే రోజుల్లో తమ దేశానికి వచ్చే ప్రయాణికుల సామార్ధ్యాన్ని పెంచేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కువైట్ తెలిపింది. ప్రస్తుతం అరవైల్ ప్రయాణికుల సామర్ధ్యాన్ని 3,500 మందికి పరిమితం చేయగా..రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 5000కు పెంచనున్నట్లు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని ప్లానింగ్ & ప్రాజెక్టు వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సాద్ అల్ ఒతైబి వెల్లడించారు. అదే సమయంలో యూరప్, అమెరికాలోని 12 గమ్యస్థానాలకు విమానాల రాకపోకలను పునరుద్ధరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎయిర్ లైన్స్ వినతులు, మంత్రిమండలి ఆదేశాల మేరకు ఆయా దేశాలకు విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు పౌర విమానయాన శాఖ తగిన ఏర్పాట్లలో ఉందన్నారు. కోవిడ్ రిస్క్ తక్కువగా ఉన్న దేశాలకు విమాన సర్వీసులను నడుపుకోవచ్చని మంత్రిమండలి ఆమోదించిన మేరకు ఆయా దేశాలకు వారానికి ఒక్క ఫ్లైట్ చొప్పున ఒక్కో ఎయిర్ లైన్స్ నుంచి ఒక్కో విమానానికి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు. మంత్రివర్గ ఆదేశాల అమలు చేస్తూ తొలి రోజున జార్జియా ఓ విమాన సర్వీసును నడుపుతున్నామని..ఈ వారంలో లండన్, మాలాగా, సారాజేవోలకు మూడు విమాన సర్వీసులను షెడ్యూల్ చేసినట్లు వివరించారు. ప్రయాణికుల రద్దీ, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విమాన సర్వీసులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు