రోజువారి ప్రయాణికుల సంఖ్యను 5000 పెంచే దిశగా ప్లానింగ్స్
- July 03, 2021
కువైట్: రాబోయే రోజుల్లో తమ దేశానికి వచ్చే ప్రయాణికుల సామార్ధ్యాన్ని పెంచేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కువైట్ తెలిపింది. ప్రస్తుతం అరవైల్ ప్రయాణికుల సామర్ధ్యాన్ని 3,500 మందికి పరిమితం చేయగా..రానున్న రోజుల్లో ఈ సంఖ్యను 5000కు పెంచనున్నట్లు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని ప్లానింగ్ & ప్రాజెక్టు వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సాద్ అల్ ఒతైబి వెల్లడించారు. అదే సమయంలో యూరప్, అమెరికాలోని 12 గమ్యస్థానాలకు విమానాల రాకపోకలను పునరుద్ధరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎయిర్ లైన్స్ వినతులు, మంత్రిమండలి ఆదేశాల మేరకు ఆయా దేశాలకు విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు పౌర విమానయాన శాఖ తగిన ఏర్పాట్లలో ఉందన్నారు. కోవిడ్ రిస్క్ తక్కువగా ఉన్న దేశాలకు విమాన సర్వీసులను నడుపుకోవచ్చని మంత్రిమండలి ఆమోదించిన మేరకు ఆయా దేశాలకు వారానికి ఒక్క ఫ్లైట్ చొప్పున ఒక్కో ఎయిర్ లైన్స్ నుంచి ఒక్కో విమానానికి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు. మంత్రివర్గ ఆదేశాల అమలు చేస్తూ తొలి రోజున జార్జియా ఓ విమాన సర్వీసును నడుపుతున్నామని..ఈ వారంలో లండన్, మాలాగా, సారాజేవోలకు మూడు విమాన సర్వీసులను షెడ్యూల్ చేసినట్లు వివరించారు. ప్రయాణికుల రద్దీ, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విమాన సర్వీసులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







