అక్రమంగా మసాజ్ సెంటర్..నలుగురు మహిళల అరెస్ట్
- July 03, 2021
బహ్రెయిన్: అక్రమంగా మసాజ్ సెంటర్ ను నిర్వహించటమే కాకుండా కోవిడ్ నిబంధనలను బ్రేక్ చేసినందుకు నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు మహిళలతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్ కు పాల్పడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా రైడింగ్ చేసినట్లు మనామా పోలీసులు వెల్లడించారు. తమకు అందిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత నలుగురు మహిళలను అరెస్ట్ చేశామని..అరెస్టైన వారిలో ఇద్దరు అసియా, ఇద్దరు అఫ్రికా మహిళలు ఉన్నట్లు తెలిపారు. అక్రమంగా మసాజ్ సెంటర్ నిర్వహించటమే కాకుండా కోవిడ్ నిబంధనలు అన్నింటిని బ్రేక్ చేశారని వెల్లడించారు. ఇదిలాఉంటే నార్తర్న్ గవర్నరేట్లో ఓ సెలూన్ లో కోవిడ్ నిబంధనలు పాటించటం లేదని పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సిబ్బంది, పర్యాటక శాఖ సిబ్బంది గుర్తించి సెలూన్ ను మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







