అక్రమంగా మసాజ్ సెంటర్..నలుగురు మహిళల అరెస్ట్
- July 03, 2021
బహ్రెయిన్: అక్రమంగా మసాజ్ సెంటర్ ను నిర్వహించటమే కాకుండా కోవిడ్ నిబంధనలను బ్రేక్ చేసినందుకు నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు మహిళలతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్ కు పాల్పడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా రైడింగ్ చేసినట్లు మనామా పోలీసులు వెల్లడించారు. తమకు అందిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత నలుగురు మహిళలను అరెస్ట్ చేశామని..అరెస్టైన వారిలో ఇద్దరు అసియా, ఇద్దరు అఫ్రికా మహిళలు ఉన్నట్లు తెలిపారు. అక్రమంగా మసాజ్ సెంటర్ నిర్వహించటమే కాకుండా కోవిడ్ నిబంధనలు అన్నింటిని బ్రేక్ చేశారని వెల్లడించారు. ఇదిలాఉంటే నార్తర్న్ గవర్నరేట్లో ఓ సెలూన్ లో కోవిడ్ నిబంధనలు పాటించటం లేదని పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సిబ్బంది, పర్యాటక శాఖ సిబ్బంది గుర్తించి సెలూన్ ను మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









