అక్రమంగా మసాజ్ సెంటర్..నలుగురు మహిళల అరెస్ట్
- July 03, 2021
బహ్రెయిన్: అక్రమంగా మసాజ్ సెంటర్ ను నిర్వహించటమే కాకుండా కోవిడ్ నిబంధనలను బ్రేక్ చేసినందుకు నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు మహిళలతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తూ ఇల్లీగల్ యాక్టివిటీస్ కు పాల్పడుతున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా రైడింగ్ చేసినట్లు మనామా పోలీసులు వెల్లడించారు. తమకు అందిన సమాచారం నిజమేనని నిర్ధారించుకున్న తర్వాత నలుగురు మహిళలను అరెస్ట్ చేశామని..అరెస్టైన వారిలో ఇద్దరు అసియా, ఇద్దరు అఫ్రికా మహిళలు ఉన్నట్లు తెలిపారు. అక్రమంగా మసాజ్ సెంటర్ నిర్వహించటమే కాకుండా కోవిడ్ నిబంధనలు అన్నింటిని బ్రేక్ చేశారని వెల్లడించారు. ఇదిలాఉంటే నార్తర్న్ గవర్నరేట్లో ఓ సెలూన్ లో కోవిడ్ నిబంధనలు పాటించటం లేదని పారిశ్రామిక మంత్రిత్వ శాఖ సిబ్బంది, పర్యాటక శాఖ సిబ్బంది గుర్తించి సెలూన్ ను మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..