బహ్రెయిన్‌ నుంచి ఇద్దరికి బహిష్కరణ

- March 09, 2016 , by Maagulf
బహ్రెయిన్‌ నుంచి ఇద్దరికి బహిష్కరణ

అక్రమంగా బహ్రెయిన్‌లో నివసిస్తున్న ఇద్దరిని దేశం నుంచి బయటకు పంపారు. 2012లో మొత్తం 72 మంది వ్యక్తులు బహ్రెయినీ పౌరసత్వాన్ని కోల్పోయారు. దేశానికి వ్యతిరేకంగా వారి చర్యలు ఉన్నందుకుగాను, వారి పౌరసత్వాన్ని రద్దు చేశారు. అందులో ఒకరు అలి ఖదాద్‌ కాగా, ఇంకొకరు ఇబ్రహీమ్‌ కరిమి. మిగతా వ్యక్తులకు సంబంధించి విచారణ జరుగుతోంది. బహ్రెయినీ పౌరసత్వాన్ని కోల్పోయినవారు కోర్టులో అప్పీల్‌ చేసుకున్నారు. అందులోంచి ఇద్దరికి తొలి విడతలో బహ్రెయిన్‌ నుంచి బయటకు పంపేలా నిర్ణయం వెలువడింది. వారిద్దరినీ బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌ నుంచి బయటకు పంపేయడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com