ఖతార్ లో భారత మామిడి ప్రమోషన్కు అపార అవకాశాలు: భారత రాయబారి
- July 09, 2021దోహా: ఖతార్ లో మామిడి పళ్లకు ఆదరణ ఎక్కువగా ఉంటుందని ఖతార్ భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్ అన్నారు. ఖతార్ పౌరులు, ప్రవాసీయులు మామిడి రుచి అస్వాదించటంలో ఎప్పుడు ముందుంటారని ఆయన అన్నారు. అందుకే భారత్ నుంచి ఖతార్ కు మామిడి ఎగుమతిపై దృష్టిసారించాలని, అందుకు తమ రాయబార కార్యాలయం నుంచి కావాల్సినంత సహాకారం ఉంటుందన్నారు. అగ్రికల్చర్& ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ-APEDA ఆధ్వర్యంలో పశ్చిమబెంగాళ్ లో జరిగిన మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ లో దీపక్ మిట్టల్ పాల్గొన్నారు. భారత్ నుంచి ఖతార్ కు పళ్లు, కూరగాయలు ఎగుమతి చేసేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. మామిడి పళ్ల ప్రమోషన్ కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, APEDA చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. ఈ సమావేశంలో APEDA చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు, పశ్చిమ బెంగాల్ డైరెక్టర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ & హార్టికల్చర్ కమిషనర్ జయంత పాల్గొన్నారు. ఇదిలాఉంటే...ఈ ప్రమోషన్ ప్రోగ్రాంలో భారత ఈశాన్య ప్రాంత భౌగోళిక గుర్తింపు ఉన్న 8 రకాల మామిడి పళ్లను ప్రదర్శించారు.
--రాజ్ కుమార్ వనాంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు