కార్మికులకు గొడుగు టోపీలను పంపిణీ చేసిన సదరన్ ఏరియా మునిసిపాలిటీ
- July 09, 2021
మనామా: సదరన్ ఏరియా మునిసిపాలిటీ, పని ప్రాంతాల్లో పని చేస్తున్న కార్మికులకు గొడుగు టోపీలను పంపిణీ చేసింది. స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తలకు తేలిగ్గా అమరిపోయేలా ఈ గొడుగు టోపీలను రూపొందించారు. ఎండ నుంచి కార్మికులకు ఈ గొడుగు టోపీలు రక్షణ ఇస్తాయి. వాటిని వారు పట్టుకోవాల్సిన పనిలేదు. ఎండ సమయాల్లో కార్మికులు ఎండ ప్రభావానికి గురి కాకుండా ఈ టోపీలు రక్షణ కల్పిస్తాయని అధికారులు తెలిపారు. స్వచ్ఛందంగా వీటిని అందించేందుకు ముందుకొచ్చిన ఆయా సంస్థల్ని మునిసిపాలిటీ అభినందించింది. జులై నుంచి ఆగస్ట్ చివరి వరకు మధ్యాహ్నం వర్క్ బ్యాన్ అమలు చేస్తూ సదరన్ మునిసిపాలిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ వేడిలో పని చేయడంపై బ్యాన్ కొనసాగుతోంది. ఈ నిబంధనను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







