సీజనల్‌ బ్యాన్‌తో పెరిగిన చేపల ధరలు

- March 09, 2016 , by Maagulf
సీజనల్‌ బ్యాన్‌తో పెరిగిన చేపల ధరలు

మార్చ్‌ 1 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విధించిన బ్యాన్‌ కారణంగా మార్కెట్‌లో చేపల ధరలు గణనీయంగా పెరిగాయి. రాబిట్‌ ఫిష్‌, ఎంపరర్‌ ఫిష్‌ ధరలు మండుతున్నాయి. గ్రూపర్‌ ఫిష్‌ (హేమర్‌) యూఏఈలో చాలా పాపులర్‌. దీనికి కూడా డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. సీజనల్‌ బ్యాన్‌ కారణంగా ధరల పెరుగుదల 40 నుంచి వంద శాతం ఉన్నట్లు డేరా ఫిష్‌ మార్కెట్‌ వ్యాపారులు వెల్లడించారు. రీ-ప్రొడక్టివ్‌ సీజన్‌ కారణంగా చేపల ఉత్పత్తిని పెంచేందుకే ఈ బ్యాన్‌ విధించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా హేమర్‌ కిలో ధర 20 నుంచి 25 దిర్హామ్‌లదాకా ఉంటుంది. అయితే ఇప్పుడు అది 35 నుంచి 40 దిర్హామ్‌లకు చేరుకుంది. బ్యాన్‌ నిబంధనల్ని ఉల్లంఘించినవారికి 1000 దిర్హామ్‌లదాకా ఫైన్‌ తప్పనిసరి. పదే పదే నిబంధనల్ని ఉల్లంఘిస్తే, దుకాణాల మూసివేతకూ ఆదేశాలిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com