సీజనల్ బ్యాన్తో పెరిగిన చేపల ధరలు
- March 09, 2016
మార్చ్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు విధించిన బ్యాన్ కారణంగా మార్కెట్లో చేపల ధరలు గణనీయంగా పెరిగాయి. రాబిట్ ఫిష్, ఎంపరర్ ఫిష్ ధరలు మండుతున్నాయి. గ్రూపర్ ఫిష్ (హేమర్) యూఏఈలో చాలా పాపులర్. దీనికి కూడా డిమాండ్ విపరీతంగా పెరిగింది. సీజనల్ బ్యాన్ కారణంగా ధరల పెరుగుదల 40 నుంచి వంద శాతం ఉన్నట్లు డేరా ఫిష్ మార్కెట్ వ్యాపారులు వెల్లడించారు. రీ-ప్రొడక్టివ్ సీజన్ కారణంగా చేపల ఉత్పత్తిని పెంచేందుకే ఈ బ్యాన్ విధించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా హేమర్ కిలో ధర 20 నుంచి 25 దిర్హామ్లదాకా ఉంటుంది. అయితే ఇప్పుడు అది 35 నుంచి 40 దిర్హామ్లకు చేరుకుంది. బ్యాన్ నిబంధనల్ని ఉల్లంఘించినవారికి 1000 దిర్హామ్లదాకా ఫైన్ తప్పనిసరి. పదే పదే నిబంధనల్ని ఉల్లంఘిస్తే, దుకాణాల మూసివేతకూ ఆదేశాలిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







