ఏపీ డిజిపి గౌతం సవాంగ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మహిళా పోలీసులు

- July 13, 2021 , by Maagulf
ఏపీ డిజిపి గౌతం సవాంగ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మహిళా పోలీసులు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మహిళల భద్రత,రక్షణకు పెద్దపీట  వేస్తూ అనుక్షణం వారికి తోడు నీడగా అన్నివేళలా అందుబాటులో ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి గ్రామ,వార్డు సచివాలయల్లోని 15,000 మంది మహిళ సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ  జీవో నెంబర్ 59ని జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మహిళా పోలీసులు ముఖ్యమంత్రికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంధర్భంగా మహిళా పోలీసులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తాము పోలీసు శాఖలో అంతర్భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పోలీస్ శాఖ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ సర్వీసెస్ DIG G.పాలరాజు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com