ప్రయాణ నిబంధనలు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలన్న ప్రభుత్వం
- July 14, 2021
ఖతార్: సమ్మర్ బ్రేక్ లో చాలా మంది పౌరులు, ప్రవాసీయులు ఇతర దేశాలు, సొంత దేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం ప్రయాణ విధానాలపై కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు ట్రావెల్ పాలసీలో అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు https://covid19.moph.gov.qa/EN/travel-and-return-policy/Pages/default.aspx లింక్ ద్వారా చెక్ చేసుకోవాల్సిందిగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. కోవిడ్ నేపథ్యంలో ట్రావెల్ పాలసీలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయని, కొత్త నిబంధనలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని తెలిపింది. అయితే..సమ్మర్ వెకేషన్లో చాలామంది విదేశీ ప్రయాణాలకు ప్లాన్ చేసుకుంటున్న నేపథ్యంలో జూన్ 8న ప్రకటించిన ట్రావెల్ పాలసీని ప్రకటించింది. జులై 12 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. అయితే..తొలుత ప్రకటించిన పాలసీలో చాలా నిబంధనలను సరళతరం చేశామని పేర్కొంది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నవారికి చాలావరకు మినహాయింపులు ఇచ్చింది.
అదేవిధంగా విదేశాల నుంచి తిరిగివచ్చే వారు తమ ప్రయాణానికి ముందే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..సవరించిన నిబంధనల మేరకు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఒక అప్షన్ గా మాత్రమే పరిగణించవచ్చు. తొలుత సినోవాక్ ను కండీషనల్ వ్యాక్సినేషన్ లిస్ట్ నుంచి తొలిగించింది. చిన్నారుల క్వారంటైన్ విధానాల్లో కూడా మార్పులు చేసింది. ప్రవాసీయులకు సులభంగా అర్ధమయ్యేలా అరబిక్, తమిళ్, మళయాలం, సిన్హాలా, హింది భాషల్లో ట్రావెల్ పాలసీని అప్ డేట్ చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పరిస్థితులకు అనుగుణంగా నిబంధనల్లో సవరణలు మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక, ప్రయాణికులు ఎప్పటికప్పుడు ట్రావెల్ పాలసీని చెక్ చేసుకోవాలని సూచించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







