వింబుల్డన్ 2021: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం
- July 14, 2021
వింబుల్డన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మ్యాచ్ ఫికింగ్ నేపథ్యంలో రెండు మ్యాచ్లపై విచారణ జరుగుతోంది. ఒక సింగిల్స్ మ్యాచ్, మరో డబుల్స్ మ్యాచ్పై ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. అధిక బెట్టింగ్ నమూనాలను గుర్తించిన అధికారులు.. ఆ రెండు మ్యాచ్లపై విచారణ జరుపుతున్నారు. కొన్ని బెట్టింగ్ సంస్థలు కూడా ఈ మ్యాచ్లపై జరిగిన బెట్టింగ్లపై సందేహాలు వ్యక్తం చేశాయి. మెన్స్ డబుల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఈ అనుమానాస్పద లిస్ట్లో ఉంది. లైవ్ బెట్స్ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఈ మ్యాచ్ ఫేవరెట్ జోడీ ఓడిపోయినట్లు పలు బెట్టింగ్ సంస్థలు ఫిర్యాదు చేశాయి.
ఈ జోడీ తొలి సెట్ గెలిచి తర్వాతి రెండు సెట్లను ఓడిపోయింది. ఇక మరొకటి జర్మన్ ప్లేయర్ ఆడిన ఫస్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్. అయితే ఆ ప్లేయర్ ప్రత్యర్థిపై ఈ మ్యాచ్లో అనుమానాలు ఉన్నాయి. సెకండ్ సెట్ తర్వాత పరిస్థితిపై ఐదు అంకెల మొత్తం బెట్టింగ్ నడిచినట్లు తేలింది. కచ్చితంగా ఫలితం కూడా అలాగే వచ్చింది. ఈ మ్యాచ్లో సర్వీస్ గేమ్స్ సంఖ్యపై కూడా ప్రత్యేక బెట్స్ నడిచాయి. ఈ రెండు మ్యాచ్లపై ఐటీఐఏ విచారణ జరుపుతోంది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







