రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- July 15, 2021
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కాశీలో రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించారు. జపాన్ దేశ సహకారంతో ఆ కేంద్రాన్ని నిర్మించారు. కాశీ అంటే శివుడు అని, రుద్రాక్ష్ లేకుండా ఆ నగరం అభివృద్ధి చెందినట్లు ఎలా చెబుతామని ఆయన అన్నారు. కాశీ పట్టణం ఇప్పుడు రుద్రాక్షను ధరించినట్లు ఆయన తెలిపారు. ఇక నుంచి ఆ పట్టణ శోభ మరింత పెరుగుతుందని ప్రధాని చెప్పారు. వారాణాసిలో పర్యటిస్తున్న ప్రధాని అక్కడ 1500 విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. కన్వెన్షన్ సెంటర్లో రుద్రాక్ష మొక్కను నాటారు.
ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మాట్లాడారు. వారణాసిలో రుద్రాక్ష్ సెంటర్ను నిర్మించినందుకు ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని యోషిడే సుగాకు ఆయన కృతజ్ఞతలు ఎతలిపారు. ఇండో-జపాన్ స్నేహానికి రుద్రాక్ష్ సెంటర్ సంకేతంగా నిలుస్తుందని యోగి అన్నారు.

ఆధునిక సాంకేతికతో రుద్రాక్ష్ను నిర్మించారు. సుమారు 1,200 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంది. రెండు అంతస్తుల కన్వెన్షన్ సెంటర్ను జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) సహకారంతో నిర్మించారు. దాదాపు 200 కోట్ల వ్యయంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో వారణాసిలోని సిగ్రా ప్రాంతంలో దీన్ని నిర్మించారు. ఈ సెంటర్ లో అన్ని రకాల అంతర్జాతీయ సమావేశాలు, సంగీత కచేరీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే అందుకు కావాల్సిన సదుపాయాల్ని అందించనున్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







