6,600 మంది ఆఫీసర్లకు ప్రమోషన్లు
- July 15, 2021
దుబాయ్: యూఏఈ ప్రధాని, దూబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ లోని 6,600 మంది ప్రభుత్వ అధికారులకు పదోన్నతులు కలిపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన వారిలో పోలీసులు, జనరల్ ఆఫీసర్, రెసిడెన్సీ& ఫారెన్ అఫైర్స్, జీడీఆర్ఎఫ్ఏ, దుబాయ్ సివిల్ డిఫెన్స్ విభాగాల్లోని అధికారలతో పాటు నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు ఉన్నారు.
దుబాయ్ రూలర్ ఆదేశాల మేరకు లెఫ్టినెంట్ జనరల్ పొందిన సీనియర్ అధికారుల్లో ప్రమోషన్ పొందిన ఉన్నతాధికారుల్లో జీడీఆర్ఎఫ్ఏ డైరెక్టర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మర్రి, దుబాయ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ రషీద్ తని అల్ మాత్రూషి, దుబాయ్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ తలాల్ హుమైద్ బల్హౌల్ అల్ ఫలాసీలు ఉన్నారు. లెఫ్టినెంట్ జనరల్ గా పదోన్నతి పొందిన సీనియర్ అధికారులు అందరూ దుబాయ్ లో శాంతి భద్రతలను మెరుగుపర్చటంలో విశేష సేవలు అందించారని అన్నారు. ప్రపంచంలోనే సురక్షిత నగరాల్లో దుబాయ్ చోటు దక్కించుకుందంటే అది వీరి కృషి ఫలితమేనని ప్రశంసించారు. ఇదిలాఉంటే..శాఖల వారీగా పదోన్నతులు పొందిన వారిలో దుబాయ్ పోలీస్ విభాగంలో NCOలు, పోలీసులు అధికారులు 5,823 మంది అధికారులు ఉన్నారు. జీడీఆర్ఎఫ్ఏలో 483 మంది, దుబాయ్ సివిల్ డిఫెన్స్ లో 299 మందికి పదోన్నతులు దక్కయి.
తాజా వార్తలు
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







