తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం

- July 17, 2021 , by Maagulf
తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం

కేరళ: క‌రోనా రెండో దశ విజృంభణ తర్వాత తొలిసారిగా శ‌బ‌రిమ‌ల‌ అయ్యప్ప ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. ఈ రోజు తెల్ల‌వారుజామున భ‌క్తుల ద‌ర్శ‌నార్థం తెరిచారు. అనంత‌రం సుప్రభాత, ఇత‌ర సేవ‌ల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. క‌రోనా ప‌రిస్థితుల నేపథ్యంలో ప‌రిమిత సంఖ్య‌లోనే భ‌క్తుల‌ను అనుమతిస్తున్నట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు చెప్పింది. అలాగే, క‌రోనా టీకా రెండు డోస్‌లు వేసుకున్నవారు, ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తీసుకొచ్చిన వారికే అనుమ‌తి ఉంటుందని, దర్శనానికి వచ్చే వారు 72 గంటల ముందు చేయించుకున్న కరోనా పరీక్షను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఇందుకోసం ఇప్ప‌టికే ఆన్‌లైన్ బుకింగ్ సౌక‌ర్యాలు క‌ల్పించారు. ముందుగా టికెట్లు బుక్‌ చేసుకున్న‌ వారికి అవకాశం కల్పిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com