విమాన సర్వీసులపై ఎతిహాద్ ఎయిర్లైన్స్ కీలక ప్రకటన!
- July 17, 2021
యూఏఈ: యూఏఈ నేషనల్ క్యారియర్ ఎతిహాద్ ఎయిర్వేస్ భారత్తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ విమాన సర్వీసులపై తాజాగా కీలక ప్రకటన చేసింది.ఈ మూడు దేశాల విమాన సర్వీసులను జూలై 31 వరకు సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.యూఏఈ అథారిటీస్ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విమానాలను ఈ నెల 31 వరకు పూర్తిగా రద్దు చేసినట్లు ఎతిహాద్ పేర్కొంది. కనుక ఆయా దేశాలకు చెందిన ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిపెట్టుకుని విమాన టికెట్లు బుకింగ్ చేసుకోవాలని సూచించింది. ఇక ఇప్పటికే టికెట్ బుకింగ్ చేసుకున్న వారు భారీ సంఖ్యలో తమ కాంటాక్ట్ సెంటర్, సోషల్ మీడియా బృందాన్ని సంప్రదిస్తున్నారని, బుకింగ్ విషయంలో నేరుగా తమను కాంటాక్ట్ చేయొద్దని కోరింది.

అసీఫ్ అనే ప్రయాణికుడి ట్వీట్కు స్పందించిన ఎతిహాద్..అతడికి కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. జూలై 31 వరకు భారత్ నుంచి యూఏఈకి విమాన సర్వీసులు పూర్తి నిలిపివేసినట్లు వెల్లడించింది. ఇతర వివరాల కోసం ఎతిహాద్ అధికారిక వెబ్సైట్ https://t.co/hWA7ZGfiaFలో చూడాలని తెలిపింది. ఇదిలా ఉంటే..యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(GCAA) మాత్రం ఇప్పటివరకు భారత్కు విమాన సర్వీసుల పునరుద్ధరణపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







