పవిత్ర స్థలాల్లో మొబైల్ ఫీల్డ్ ఆస్పత్రులు ఏర్పాటు
- July 19, 2021సౌదీ: హజ్ యాత్ర నేపథ్యంలో పవిత్ర స్థలాలలో యాత్రికులకు సేవ చేయడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మొబైల్ ఫీల్డ్ ఆసుపత్రిని సిద్ధం చేసింది. అరాఫత్ ప్రాంతం, నమీరా మసీదుకు ఉత్తర ప్రాంతంతో పాటు అవసరమైన ఇతర ప్రాంతాలలో వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ మొబైల్ ఫీల్డ్ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, కన్సల్టెంట్ల బృందం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లోనూ పేషెంట్లకు వైద్యం అందించేలా మొత్తం 11 పడకలతో ఏర్పాట్లు ఉన్నాయి. వాటిలో రెండు ఇంటెన్సివ్ కేర్, నాలుగు ఇన్ పేషెంట్ కేర్, ఐదు మెడికల్ కేర్ పడకలుగా కేటాయించారు. అలాగే ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సరిపడా వెంటిలేటర్లు, డీఫిబ్రిలేటర్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ