లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల కోసం జనం క్యూ
- July 20, 2021ఒమన్: ఒమన్ లో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో జనం నిత్యావసరాల కోసం క్యూ కట్టారు. కర్ఫ్యూ రోజుల్లో బయటికి వచ్చేందుకు అవకాశం ఉండదు కనుక తమకు కావాల్సిన వస్తువులను ముందే తెచ్చిపెట్టుకుంటున్నారు. దీంతో సోమవారం సూపర్ మార్కెట్లు, కూరగాయలు, పాలు ఇతర నిత్యావసరాల వాణిజ్య కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచే మస్కట్ లోని సూపర్ మార్కెట్లు, ఇతర నిత్యావసర సరుకుల వాణిజ్య కేంద్రాలకు కస్టమర్లు క్యూ కట్టారు. పాల ట్రక్కులు వచ్చిరాకముందే పెద్ద సంఖ్యలో జనం క్యూ కట్టి తమ కోటా పాలను తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇదిలాఉంటే ప్రస్తుతం ఒమన్ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు పాక్షిక లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే..కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు జూన్ 23 వరకు పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది ఒమన్. అత్యవసర వాహనాలు, వైద్య సిబ్బంది, మెడికల్ షాపులకు మాత్రమే లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే విదేశాలకు వెళ్లేవారు, విదేశాల నుంచి వచ్చే వారికి కూడా లాక్ డౌన్ సమయంలో ప్రయాణించొచ్చు. అయితే..విదేశీ ప్రయాణికులు తమ ట్రావెల్ డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ