లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల కోసం జనం క్యూ
- July 20, 2021
ఒమన్: ఒమన్ లో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో జనం నిత్యావసరాల కోసం క్యూ కట్టారు. కర్ఫ్యూ రోజుల్లో బయటికి వచ్చేందుకు అవకాశం ఉండదు కనుక తమకు కావాల్సిన వస్తువులను ముందే తెచ్చిపెట్టుకుంటున్నారు. దీంతో సోమవారం సూపర్ మార్కెట్లు, కూరగాయలు, పాలు ఇతర నిత్యావసరాల వాణిజ్య కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచే మస్కట్ లోని సూపర్ మార్కెట్లు, ఇతర నిత్యావసర సరుకుల వాణిజ్య కేంద్రాలకు కస్టమర్లు క్యూ కట్టారు. పాల ట్రక్కులు వచ్చిరాకముందే పెద్ద సంఖ్యలో జనం క్యూ కట్టి తమ కోటా పాలను తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇదిలాఉంటే ప్రస్తుతం ఒమన్ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు పాక్షిక లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే..కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు జూన్ 23 వరకు పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది ఒమన్. అత్యవసర వాహనాలు, వైద్య సిబ్బంది, మెడికల్ షాపులకు మాత్రమే లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే విదేశాలకు వెళ్లేవారు, విదేశాల నుంచి వచ్చే వారికి కూడా లాక్ డౌన్ సమయంలో ప్రయాణించొచ్చు. అయితే..విదేశీ ప్రయాణికులు తమ ట్రావెల్ డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







