లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల కోసం జనం క్యూ
- July 20, 2021ఒమన్: ఒమన్ లో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు అవుతున్న నేపథ్యంలో జనం నిత్యావసరాల కోసం క్యూ కట్టారు. కర్ఫ్యూ రోజుల్లో బయటికి వచ్చేందుకు అవకాశం ఉండదు కనుక తమకు కావాల్సిన వస్తువులను ముందే తెచ్చిపెట్టుకుంటున్నారు. దీంతో సోమవారం సూపర్ మార్కెట్లు, కూరగాయలు, పాలు ఇతర నిత్యావసరాల వాణిజ్య కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచే మస్కట్ లోని సూపర్ మార్కెట్లు, ఇతర నిత్యావసర సరుకుల వాణిజ్య కేంద్రాలకు కస్టమర్లు క్యూ కట్టారు. పాల ట్రక్కులు వచ్చిరాకముందే పెద్ద సంఖ్యలో జనం క్యూ కట్టి తమ కోటా పాలను తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఇదిలాఉంటే ప్రస్తుతం ఒమన్ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు పాక్షిక లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే..కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు జూన్ 23 వరకు పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది ఒమన్. అత్యవసర వాహనాలు, వైద్య సిబ్బంది, మెడికల్ షాపులకు మాత్రమే లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాగే విదేశాలకు వెళ్లేవారు, విదేశాల నుంచి వచ్చే వారికి కూడా లాక్ డౌన్ సమయంలో ప్రయాణించొచ్చు. అయితే..విదేశీ ప్రయాణికులు తమ ట్రావెల్ డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన