కేటీఆర్ పుట్టిన రోజు స్పెషల్.. వంద మంది దివ్యాంగులకు ఉచిత స్కూటీలు..
- July 22, 2021హైదరాబాద్: జులై 24న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘గిప్ట్ ఏ స్మైల్’ లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తాను 6 అంబులెన్స్ లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజా ప్రతినిధులు, నేతలు 90 వాహనాలు ఇచ్చారని గుర్తు చేశారు. అవసరం ఉన్న వారికి వ్యక్తిగతంగా సాయం అందించాలని, వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటాలని తెరాస నేతలు, అనుచరులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే.. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల నుంచి భారీ స్పందన వస్తోంది. తమ వంతుగా వాహనాలను విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా 50 మంది దివ్యాంగులకు స్కూటీలు ఇస్తాన్నట్లు ప్రకటించారు. దయగల మంత్రి కేటీఆర్ సారధ్యంలో పనిచేయడం తమ అదృష్టమన్నారు.. ఆయన అడుగు జాడల్లో నడవటం స్ఫూర్తిదాయకం అంటూ బాల్క సుమన్ ట్వీట్ లో పేర్కొన్నారు. మరింత మంది నేతలు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి