మీరాబాయి చానుకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి,ప్రధాని ప్రశంసలు
- July 24, 2021
న్యూఢిల్లీ: భారత్ కు తొలి పతకాన్ని అందించిన మీరాబాయి చానుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి,ప్రధాని, రాజకీయ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.టోక్యో ఒలింపిక్స్ లో పతకాల ఖాతా తెరిచిన మీరాబాయి చానుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,ప్రధాని మోదీ అభినందించారు.

‘‘ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుంది? మీరాబాయి ప్రదర్శనతో దేశమంతా ఉప్పొంగిపోతోంది.వెయిట్ లిఫ్టింగ్ లో దేశానికి రజత పతకం అందించిన ఆమెకు శుభాకాంక్షలు. ఆమె విజయం భారతీయులందరిలోనూ స్ఫూర్తిని నింపుతుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. పతకం కోసం బరువులు మాత్రమే ఎత్తలేదు.. దేశాన్నే అంతెత్తుకు ఎత్తావు అంటూ ఫుట్ బాల్ కెప్టెన్ సునిల్ ఛెత్రి అభినందించాడు.

ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి ఆమె దేశం గర్వపడేలా చేసిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు. ఇది చాలా మంచి విజయం, చాలా మంచి రోజని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ అన్నారు. ఈ విజయం భారత క్రీడాకారుల్లో నైతిక స్థైర్యాన్ని నింపుతుందని రెజ్లర్ బజ్రంగ్ పూనియా అన్నాడు.

క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఆమెను అభినందనలతో ముంచెత్తాడు.గాయం నుంచి కోలుకుని మరీ పతకం సాధించి చరిత్ర సృష్టించావంటూ కొనియాడాడు.వెయిట్ లిఫ్టింగ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచావని పేర్కొన్నాడు.టీమిండియా దూసుకెళ్లాలని ఆకాంక్షించాడు. పరుగుల రాణి పీటీ ఉష..ఆమెకు శుభాకాంక్షలు చెప్పింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







