మొదటి డోసు: 2 మిలియన్ల మార్కుకి చేరువవుతున్న ఖతార్

- July 24, 2021 , by Maagulf
మొదటి డోసు: 2 మిలియన్ల మార్కుకి చేరువవుతున్న ఖతార్

దోహా: ఖతార్ అతి త్వరలో 2 మిలియన్ల మార్కు చేరుకోనుంది కోవిడ్ 19 వ్యాక్సినేషన్ విషయమై. కనీసం ఒక డోసు వేసుకున్నవారి సంఖ్య ప్రస్తుతం 1,965,422గా వుంది. 2 మిలియన్లను చేరుకోవడానికి అతి దగ్గరలో వుంది ఖతార్. నేషనల్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా శరవేగంగా వ్యాక్సిన్ డోసుల్ని అందించే ప్రక్రియ చేపడుతున్నారు. రోజుకి 20,000కి పైగా వ్యాక్సిన్లను అందిస్తున్నారు గత కొద్ది రోజులుగా. రెండు డోసుల్నీ అందుకున్నవారి సంఖ్య 1,670,850గా వుంది. మొత్తం డోసుల సంఖ్య 3,636,272గా వుంది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com