మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు
- March 11, 2016
మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో 12 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో కుంట పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న పోలీసులే లక్ష్యంగా చేసుకుని ల్యాండ్ మైన్ పెట్టి పేలుడు కు పాల్పడ్డారు. రెండు వారాల క్రితం జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ కు ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్టు సమాచారం. ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనలో గాయపడిన 12 మంది పోలీసులకు చికిత్స అందిస్తున్నారు.వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఖమ్మం జిల్లా భద్రాచలం ఆస్పత్రికి తరలించారు
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









