ఆ మృతదేహం ఎవరిది..? ప్రవాసీయుల సాయం కోరిన పోలీసులు
- July 28, 2021
దుబాయ్: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఓ వ్యక్తి దేశంగానీ దేశంలో ఊపిరి వదిలాడు. కానీ, అతను ఎవరో తెలియదు. ఏ దేశం నుంచి వచ్చాడో తెలియదు.ఎడారి ప్రాంతంలో మృత్యుఒడికి చేరి అనాధ శవంలా మిగిలిపోయాడు. అయితే...అతని వివరాలను తెలుసుకునేందుకు దుబాయ్ పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముహైసినా ప్రాంతంలో ఇసుక తిన్నెల్లో ఆసియన్ మృత దేహం లభించిందని, అయితే..తాను ఎవరనే విషయం తెలియటం లేదన్నారు. మృతదేహం దగ్గర ఎలాంటి గుర్తింపు పత్రాలు పోలీసులకు దొరకలేదు. ఎక్కడా మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో మృతుడిని గుర్తించటంలో సహాయపడాలని ప్రవాసీయులను కోరారు దుబాయ్ పోలీసులు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు.
తాజా వార్తలు
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!
- ఫాల్స్ కంటెంట్ వ్యాప్తి..బహ్రెయిన్ లో పలువురు అరెస్టు..!!
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!









