సోషల్ మీడియాలో వధువు ప్రకటనలు..అడ్మిన్లకు కోర్టు సమన్లు
- July 29, 2021
సౌదీ: పెళ్లి చూపులు అంటే ఇప్పుడు మాట్రిమోనీలదే హవా.ఆన్ లైన్లో పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి.అయితే..ఈ జోరులో కొందరు దేశ చట్టాలను, మతపరమైన విశ్వాసాలను నిర్లక్ష్యం చేస్తూ కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.సౌదీ అరేబియాలో ఇదే తరహా ఉదంతం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వధువు ప్రకనటలు పోస్ట్ చేస్తుండంతో అడ్మిన్లకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమన్లు జారీ చేసింది.సోషల్ మీడియాలో వధువు ప్రకటనలు మహిళల గౌరవానికి హాని కలిగించే విధంగా ఉండటమే కాకుండా ఇస్లామిక్ షరియా, దేశ చట్టాలను ఉల్లంఘించటమేనని కోర్టు అభిప్రాయపడింది. ప్రజా నైతిక విలువలు, మతపరమైన నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో వధువు ఫోటో, ఆమె వివరాలతో వస్తున్న ప్రకటనలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ లోని సైబర్ క్రైమ్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్మెంట్ విచారణ చేపట్టింది. పలు సోషల్ మీడియాలో ప్రకటలు ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత అడ్మిన్లకు కోర్టు సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు
- తమిళనాడు, బెంగాల్సహా ఐదు రాష్ట్రాల్లో గత ఎన్నికల ఫలితాలు ఇలా..
- ఏపీలో ‘క్యారియర్’.. రూ.1,000 కోట్ల పెట్టుబడి
- ఐదు రాష్ట్రాల గెలుపు మ్యాజిక్ ఫిగర్ ఎంత..?
- SR 1.86 ట్రిలియన్కు SAMA రిజర్వ్ అసెట్స్..గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం..!!
- భారత విమాన ఛార్జీలు పెరగవచ్చు..!!
- ధోఫార్ తీరంలో 'తక్రిజ్' ప్రాముఖ్యతను వెల్లడించిన సర్వే..!!
- Dh25 మిలియన్ల భారీ బహుమతిని గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- హమద్ ఎయిర్పోర్ట్ కు మరిన్ని ఫ్లైట్స్ షెడ్యూల్..!!
- మానిటరింగ్ ఆరోపణలను ఖండించిన కువైట్..!!
- విశాఖలో ఆర్భా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం









