సోషల్ మీడియాలో వధువు ప్రకటనలు..అడ్మిన్లకు కోర్టు సమన్లు
- July 29, 2021
సౌదీ: పెళ్లి చూపులు అంటే ఇప్పుడు మాట్రిమోనీలదే హవా.ఆన్ లైన్లో పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి.అయితే..ఈ జోరులో కొందరు దేశ చట్టాలను, మతపరమైన విశ్వాసాలను నిర్లక్ష్యం చేస్తూ కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.సౌదీ అరేబియాలో ఇదే తరహా ఉదంతం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వధువు ప్రకనటలు పోస్ట్ చేస్తుండంతో అడ్మిన్లకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమన్లు జారీ చేసింది.సోషల్ మీడియాలో వధువు ప్రకటనలు మహిళల గౌరవానికి హాని కలిగించే విధంగా ఉండటమే కాకుండా ఇస్లామిక్ షరియా, దేశ చట్టాలను ఉల్లంఘించటమేనని కోర్టు అభిప్రాయపడింది. ప్రజా నైతిక విలువలు, మతపరమైన నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో వధువు ఫోటో, ఆమె వివరాలతో వస్తున్న ప్రకటనలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ లోని సైబర్ క్రైమ్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్మెంట్ విచారణ చేపట్టింది. పలు సోషల్ మీడియాలో ప్రకటలు ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత అడ్మిన్లకు కోర్టు సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









