సోషల్ మీడియాలో వధువు ప్రకటనలు..అడ్మిన్లకు కోర్టు సమన్లు
- July 29, 2021
సౌదీ: పెళ్లి చూపులు అంటే ఇప్పుడు మాట్రిమోనీలదే హవా.ఆన్ లైన్లో పెళ్లి చూపులు జరిగిపోతున్నాయి.అయితే..ఈ జోరులో కొందరు దేశ చట్టాలను, మతపరమైన విశ్వాసాలను నిర్లక్ష్యం చేస్తూ కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు.సౌదీ అరేబియాలో ఇదే తరహా ఉదంతం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వధువు ప్రకనటలు పోస్ట్ చేస్తుండంతో అడ్మిన్లకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమన్లు జారీ చేసింది.సోషల్ మీడియాలో వధువు ప్రకటనలు మహిళల గౌరవానికి హాని కలిగించే విధంగా ఉండటమే కాకుండా ఇస్లామిక్ షరియా, దేశ చట్టాలను ఉల్లంఘించటమేనని కోర్టు అభిప్రాయపడింది. ప్రజా నైతిక విలువలు, మతపరమైన నిబంధనలకు విరుద్ధంగా సోషల్ మీడియాలో వధువు ఫోటో, ఆమె వివరాలతో వస్తున్న ప్రకటనలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ లోని సైబర్ క్రైమ్ ఇన్విస్టిగేషన్ డిపార్ట్మెంట్ విచారణ చేపట్టింది. పలు సోషల్ మీడియాలో ప్రకటలు ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత అడ్మిన్లకు కోర్టు సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







