జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ను సందర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- August 01, 2021
హైదరాబాద్: భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నేడు శంషాబాద్లోని జీఎంఆర్ వరలక్ష్మి సెంటర్ ఫర్ ఎంపర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ను సందర్శించారు.జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జీ.మల్లికార్జునరావు, జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్,ఇతర సీనియర్ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.ఈ కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలకు చెందిన డ్రాపౌట్ యువతకు వొకేషనల్ ట్రైనింగ్ను అందించి, వారికి ఉపాధి అవకాశాల కల్పనలో సహాయపడుతోంది. వెంకయ్యనాయుడు ఎలెక్ట్రీషియన్, హోటల్ మేనెజ్మెంట్, టూవీలర్ టెక్నీషియన్, వెల్డింగ్ టెక్నీషియన్, ఫాల్స్ సీలింగ్, ఏసీ టెక్నీషియన్ శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులతో మాట్లాడి శిక్షణ వివరాలు తెలుసుకున్నారు. ఎలెక్ట్రికల్ కోర్సును అభ్యసిస్తున్న ట్రెయినీలకు ఆయన కిట్లను అందజేసారు. జనపనార బ్యాగులు తయారు చేయడంలో శిక్షణ పొందుతున్న మహిళలతోనూ ఆయన మాట్లాడారు.
_1627796790.jpg)
అనంతరం వెంకయ్యనాయుడు శంషాబాద్లోని ఎయిర్ పోర్టు క్యాంపస్లో ఉన్న జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్, చిన్మయ మిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న జీఎంఆర్ చిన్మయ విద్యాలయను కూడా సందర్శించారు. ఎయిర్ పోర్టుకు సమీపంలోని గ్రామాలకు చెందిన పిల్లలకు ఈ విద్యాసంస్థ అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తోంది. ‘గిఫ్టెడ్ చిల్డ్రన్ స్కీమ్’ అన్న ప్రత్యేక పథకం కింద జీఎంఆర్వీఎఫ్ ఈ విద్యాసంస్థలో 100 మంది విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తోంది. విద్యాసంస్థ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో సంభాషించిన ఉపరాష్ట్రపతి, విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
_1627796803.jpg)
జీఎంఆర్ గ్రూపు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగమైన జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా దేశంలోని దాదాపు 20కి పైగా ప్రదేశాలలో స్థానిక ప్రజల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతోంది. గత 15 ఏళ్లకు పైగా నైపుణ్యాల శిక్షణలో ఉన్న జీఎంఆర్వీఎఫ్ ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా దేశంలోని 15 కేంద్రాలను నిర్వహిస్తోంది.
_1627796812.jpg)
_1627796894.jpg)
_1627796978.jpg)
_1627796987.jpg)
తాజా వార్తలు
- ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్కు సర్వం సిద్ధం..!!
- 7 రోజుల్లో 27వేల ఉల్లంఘనలు..1,770 ప్రమాదాలు నమోదు ..!!
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ









