వ్యాక్సిన్ పొందిన సెకండరీ స్టూడెంట్స్ కి డైరెక్ట్ క్లాసులు
- August 02, 2021సౌదీ: ఇన్నాళ్లు వర్చువల్ క్లాసెస్ కే పరిమితమైన విద్యార్ధులు ఇక నుంచి వ్యక్తిగతంగా క్లాసులకు హజరు కావాలని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.వ్యాక్సినేషన్ పొందిన ఇంటర్మీడియట్, సెకండరీ స్కూల్ విద్యార్ధులకు ఫేస్ టు ఫేస్ క్లాసులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అయితే..ప్రైమరీ, గార్టెన్ విద్యార్థులకు మాత్రం కింగ్డమ్ వ్యాప్తంగా 70 శాతం మందికి వ్యాక్సిన్ అందిన తర్వాతగానీ, లేదంటే అక్టోబర్ 30, 2021 నుంచి గానీ డైరెక్ట్ క్లాసులు నిర్వహించనున్నారు. ఒకవేళ ఆక్టోబర్ 1 కంటే ముందే 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తైతే అప్పటి నుంచే ఫేస్ టు ఫేస్ క్లాసులు ప్రారంభం అవుతాయి. ఇదిలాఉంటే..కింగ్డమ్ వ్యాప్తంగా ఇప్పటివరకు 27 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించారు. ప్రస్తుతం సౌదీలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్-బయోటెక్, జాన్సన్ & జాన్సన్, మోడర్నా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ