మొబైల్ చోరీ బహ్రెయిన్ వ్యక్తికి జైలుశిక్ష

- August 04, 2021 , by Maagulf
మొబైల్ చోరీ బహ్రెయిన్ వ్యక్తికి జైలుశిక్ష

బహ్రెయిన్: షాపు యజమానికి టోక్రా ఇచ్చి రెండు మొబైల్ ఫోన్లను కాజేసిన వ్యక్తికి బహ్రెయిన్ ఉన్నత అప్పీల్ కోర్టు జైలు శిక్ష విధించింది. నిందితుడు కాజేసిన మొబైల్ ఫోన్ విలువ BD800. తొలుత మొబైల్ షాపును కాంటాక్ట్ అయిన నిందుతుడు రెండు ఫోన్లను ఆర్డర్ చేశాడు. డబ్బులను బెన్ఫిట్ యాప్ ద్వారా చెల్లిస్తానని తెలిపాడు. దీంతో ఆ షాపు యజమాని అతనికి రెండు ఫోన్లను డెలివరీ చేశాడు. డబ్బులను కాసేపట్లోనే చెల్లిస్తానంటూ నమ్మించాడు నిందితుడు. తీరా ఫోన్లు చేతిలోకి రాగానే కాంటాక్ట్ నెంబర్ ను స్విచ్ఛాఫ్ చేసి డబ్బులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించాడు. తాను మోసపోయానని గ్రహించిన షాపు ఓనర్ తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడ్ని పట్టుకున్న అధికారులు అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరలించటంతో..విచారణ తర్వాత అతనికి జైలు శిక్ష ఖరారు అయ్యింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com