కాంస్యాన్ని కైవసం చేసుకున్న భారత హాకీ జట్టు

- August 05, 2021 , by Maagulf
కాంస్యాన్ని కైవసం చేసుకున్న భారత హాకీ జట్టు

టోక్యో: ఎలాగైనా స్వ‌ర్ణం గెల‌వాల‌ని టోక్యో ఒలింపిక్స్ బ‌రిలోకి దిగిన భార‌త పురుషుల హాకీ జ‌ట్టు సెమీస్‌తో ప్ర‌పంచ ఛాంపియ‌న్ బెల్జియం చేతిలో ఒట‌మిపాలైన సంగ‌తి తెలిసిందే.కాగా, ఈరోజు కాంస్య‌ప‌త‌కం పోరులో భార‌త జ‌ట్టు జ‌ర్మ‌నీతో త‌ల‌ప‌డింది.నాలుగు క్వార్ట‌ర్ లుగా సాగిన గేమ్ హోరాహోరీగా సాగింది.రెండు క్వార్ట‌ర్‌లు ముగిసే స‌రికి 3-3 గోల్స్‌తో స‌మంగా ఉన్నాయి.  అయితే, మూడో క్వార్టర్ లో ఇండియా లీడ్ సాధించి రెండు గోల్స్ చేసి 5-3 ఆధిక్యాన్ని సాధించింది.కీల‌క‌మైన నాలుగో క్వార్ట‌ర్ ప్రారంభంలోనే జ‌ర్మ‌నీ జ‌ట్టు గోల్ చేసి లీడ్‌ను 5-4కి త‌గ్గించింది.అయితే, భార‌త ఆట‌గాళ్లు ఆట‌పైన‌, బంతిపైన నియంత్ర‌ణ సాధించి జ‌ర్మ‌నీ మ‌రో గోల్ చేయకుండా అడ్డుకున్నారు.దీంతో ఇండియా జ‌ట్టు 5-4 గోల్స్ తేడాతో జ‌ర్మ‌నీపై విజ‌యం సాధించి కాంస్య‌ప‌త‌కాన్ని గెలుచుకుంది.41 ఏళ్ల త‌రువాత హాకీ జ‌ట్టు ఒలింపిక్స్‌లో ప‌త‌కం సాధించింది. ఒలింపిక్స్‌తో ప‌త‌కం సాధించిన ఇండియా జ‌ట్టుకు భార‌త ప్ర‌ధాని మోడీ అభినంద‌ల‌ను తెలియ‌జేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com