కోవిడ్ తీవ్రత ఎక్కువ దేశాల ప్రవాసీయులకు నో ఎంట్రీ
- August 05, 2021
కువైట్: విదేశాల నుంచి వచ్చే ప్రవాసీయుల ప్రవేశ అనుమతికి సంబంధించి మరోసారి కువైట్ ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రవాసీయులకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అయితే..డాక్టర్లు, దౌత్యవేతలు, కోవిడ్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి పొందిన వారికి మాత్రం అనుమతి ఉంటుంది. ప్రస్తుతం కువైట్ కోవిడ్ హై రిస్క్ దేశాల జాబితాలో ఇండియా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. ఆయా దేశాల నుంచి ప్రవాసీయులకు డైరెక్ట్ ఎంట్రీకి అనుమతి ఇవ్వాలా..వద్దా అనే నిర్ణయాన్ని మంత్రిత్వ శాఖ భవిష్యత్తులో ప్రకటించనుంది. ఇదిలాఉంటే ప్రస్తుతం కువైట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో రోజుకు గరిష్టంగా 5000 వరకు పెంచినా..గత కొద్ది రోజులుగా దేశంలోకి వచ్చే ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరలేకపోతోంది. కొద్ది రోజులుగా రోజుకి 3000 మంది వరకు మాత్రమే కువైట్ వస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







