ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీస్

- August 05, 2021 , by Maagulf
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన రాచకొండ పోలీస్

హైదరాబాద్: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. బెట్టింగ్ ముఠా నుంచి రూ.15.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 4 సెల్‌ఫోన్లు, 28 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్గనైజర్ షేక్ సాదిక్ నుంచి రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్ చేశారు. ఆర్గనైజర్ కుటుంబ సభ్యులకు చెందిన 9 బ్యాంక్ అకౌంట్‌లను గుర్తించారు. అకౌంట్లలో ఉన్న రూ.69.60 లక్షల నగదును సీజ్ చేశారు. యూబీయూఏఈ బెట్, 8 టీమ్, ఎంబీ మ్యాక్స్, ఇన్‌ప్లే బెట్ లాంటి యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.ప్రజలను బెట్టింగ్‌లకు ఆకర్షితులు కావద్దని రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com