ఇండియా - యూఏఈ : ఈ ఎమిరేట్లకు వచ్చేవారికి క్వారంటైన్ తప్పనిసరి
- August 05, 2021
యూఏఈ: భారత్ నుండి అబుధాబి మరియు రస్ అల్ ఖైమాకు వెళ్లే ప్రయాణీకులు తప్పనిసరిగా 10 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్ చేయాలి అని తెలిపిన అధికారులు.
ట్రావెల్ ఏజెంట్లకు యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జిసిఎఎ) జారీ చేసిన భద్రతా సర్క్యులర్ లో, ఎయిర్ ఇండియా/ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ద్వారా యూఏఈలోని ఈ రెండు విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణీకులు క్వారంటైన్ సమయంలో తప్పనిసరిగా ట్రాకింగ్ పరికరాన్ని ధరించాలని చెప్పారు. అంతేకాకుండా, ప్రయాణీకులు తప్పనిసరిగా నాల్గవ మరియు ఎనిమిదవ రోజులలో PCR పరీక్షలు చేయించుకోవాలి.
దుబాయ్ మరియు షార్జాకు వెళ్లే ప్రయాణీకులు తప్పనిసరిగా యూఏఈ రాగానే ఎయిర్పోర్ట్ లో PCR పరీక్ష చేయించుకోవాలి, కానీ వారు 10 రోజులు క్వారంటైన్ అవసరం లేదు. అయితే, PCR నెగటివ్ రిపోర్ట్ వచ్చే వరకు నిర్బంధంలో ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం









