ఇండియా - యూఏఈ : ఈ ఎమిరేట్లకు వచ్చేవారికి క్వారంటైన్ తప్పనిసరి

- August 05, 2021 , by Maagulf
ఇండియా - యూఏఈ : ఈ ఎమిరేట్లకు వచ్చేవారికి క్వారంటైన్ తప్పనిసరి

యూఏఈ: భారత్ నుండి అబుధాబి మరియు రస్ అల్ ఖైమాకు వెళ్లే ప్రయాణీకులు తప్పనిసరిగా 10 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్ చేయాలి అని తెలిపిన అధికారులు.

ట్రావెల్ ఏజెంట్లకు యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జిసిఎఎ) జారీ చేసిన భద్రతా సర్క్యులర్ లో, ఎయిర్ ఇండియా/ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ద్వారా యూఏఈలోని ఈ రెండు విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణీకులు క్వారంటైన్ సమయంలో తప్పనిసరిగా ట్రాకింగ్ పరికరాన్ని ధరించాలని చెప్పారు. అంతేకాకుండా, ప్రయాణీకులు తప్పనిసరిగా నాల్గవ మరియు ఎనిమిదవ రోజులలో PCR పరీక్షలు చేయించుకోవాలి.

దుబాయ్ మరియు షార్జాకు వెళ్లే ప్రయాణీకులు తప్పనిసరిగా యూఏఈ రాగానే ఎయిర్పోర్ట్ లో PCR పరీక్ష చేయించుకోవాలి, కానీ వారు 10 రోజులు క్వారంటైన్ అవసరం లేదు. అయితే, PCR నెగటివ్ రిపోర్ట్ వచ్చే వరకు నిర్బంధంలో ఉండాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com