ఆఫ్గాన్ పరిస్థితులపై ఖతార్ ఆవేదన..శాంతిస్థాపన జరగాలని పిలుపు

- August 16, 2021 , by Maagulf
ఆఫ్గాన్ పరిస్థితులపై ఖతార్ ఆవేదన..శాంతిస్థాపన జరగాలని పిలుపు

దోహా: ఆఫ్గనిస్తాన్ లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితులపై ఖతార్ ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసింది. ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో వేగంగా జరుగుతున్న పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తుని పేర్కింది.ఆఫ్గాన్ అంతటా తక్షణమే శాశ్వత కాల్పుల విరమణకు పిలుపునిస్తున్నట్లు ఖతార్  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఆఫ్గాన్ రాజకీయ పరిష్కారం కోసం శాంతియుత అధికార మార్పిడి జరిగేలా వెంటనే సమగ్ర చర్యలు ప్రారంభం అవ్వాలని ఆకాంక్షించింది.ఇందుకు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని దేశ భద్రత, స్థిరత్వం కోసం అడుగులు పడాలని అభిప్రాయపడింది.ఆఫ్గాన్ అంతటా ప్రజల భద్రతకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది.ఆఫ్గనిస్తాన్లో శాశ్వత శాంతిని సాధించడానికి ఐక్యరాజ్యసమితితో పాటు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేయటానికి ఖతార్ సిద్ధంగా ఉంటుందని పునరుద్ఘాటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com