సౌదీకి చేరుకున్న విదేశీ ఉమ్రా యాత్రికుల తొలి బృందం
- August 16, 2021
సౌదీ: కోవిడ్ 19 ఆంక్షల ఎత్తివేత తర్వాత విదేశీ ఉమ్రా యాత్రికుల తొలి బృందం సౌదీకి చేరుకుంది. కింగ్డమ్ విమానాశ్రయాలకు చేరుకున్న యాత్రికులను సౌదీ అధికారులు ఖర్జూరాలు, గులాబీలు, జామ్ జామ్ వాటర్ వంటి బహుమతులతో స్వాగతం పలికారు. హజ్ & ఉమ్రా డిప్యూటీ మంత్రి అబ్దుల్ఫత్తా బిన్ సులైమాన్ మషాత్ మాట్లాడుతూ.. సౌదీ ఉమ్రా బృందాలన్నీ విదేశీ యాత్రికులకు సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాయని, యాత్రికులు సౌదీకి చేరుకున్న నాటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఉత్తమ సేవలను అందించడానికి అంకితమయ్యాయని అన్నారు. ఇదిలాఉంటే..కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటోంది సౌదీ ప్రభుత్వం. ఉమ్రా యాత్రకు వచ్చే యాత్రికులు తప్పకుండా తమ వ్యాక్సిన్ సర్టిఫికెట్లను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. సౌద ఆమోదించిన మోడెర్నా, ఫైజర్-బయోటెక్, జాన్సన్ & జాన్సన్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లలో ఏదో ఒక వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. ఒకవేళ యాత్రికుల్లో ట్రావెల్ బ్యాన్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే యాత్రికులైతే తప్పనిసరిగా క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







