పురావస్తు పార్క్ ను సందర్శించిన సుల్తాన్ సతీమణి
- August 16, 2021
ఒమన్: ఒమన్ సుల్తాన్ సతీమణి ధోఫర్ గవర్నరేట్ సలాలాలోని విలాయత్లోని అల్ బలీద్ పురావస్తు పార్కును సందర్శించారు. పార్క్ లో ప్రధానమైన ఫ్రాంకిన్సెన్స్ ల్యాండ్ మ్యూజియంను ఆమె తొలుత సందర్శించినట్లు హెరిటేజ్& టూరిజం మంత్రిత్వ శాఖ తెలిపింది. పురావస్తు మ్యూజియంలో వివిధ కాలాలకు చెందిన పలు చారిత్రాత్మక వస్తువులు ఉన్నాయని, అలాగే ఒమానీ సాంప్రదాయ ఓడల నమూనాలు ప్రదర్శనకు ఉన్నట్లు వివరించింది. సుల్తాన్ సతీమణి పురావస్తు పార్కులోని వివిధ ఇతర విభాగాలను వీక్షించారు. ఆ తర్వాత ఒమాని కుటీర పరిశ్రమకు మద్దతుగా సంప్రదాయ హస్తకళలను విక్రయించే అవుట్లెట్లను సందర్శించారు. చివరగా VIP సందర్శకుల రిజిస్టర్లో తన ప్రశంసలను నమోదు చేయడంతో ఆమె పర్యటనను ముగించారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







