ఆరు నెలల తర్వాత తొలి కరోనా కేసు.. మూడు రోజుల లాక్డౌన్
- August 17, 2021
వెల్లింగ్టన్: కరోనాపై ఎడతెగని పోరాటం చేసి విజయం సాధించిన న్యూజిలాండ్(New Zealand) లో ఆరు నెలల తర్వాత స్థానికంగా సంక్రమించిన తొలి కేసు నమోదైంది. ఈ కేసును డెల్టా వేరియంట్గా అనుమానిస్తున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ మూడు రోజుల లాక్డౌన్ ప్రకటించారు. డెల్టా వేరియంట్ పరిస్థితిని మొత్తం మార్చగలదని ఆమె అన్నారు. కరోనాపై పూర్తిగా విజయం సాధించకపోతే ఏం జరుగుతుందో మనం ప్రపంచమంతా గమనిస్తే తెలుస్తుంది అని జెడిండా చెప్పారు.
ఈ కేసు ఆక్లాండ్లో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ కరోనా కేసు ఎలా నమోదైందన్నదానిపై అధికారులు ఇంకా ఓ అంచనాకు రాలేదు. ఫిబ్రవరి 28 తర్వాత న్యూజిలాండ్లో నమోదైన తొలి కేసు ఇదే. 50 లక్షల జనాభాలో ఉన్న న్యూజిలాండ్లో ఇప్పటి వరకూ కరోనా కారణంగా కేవలం 26 మంది మాత్రమే మరణించారు. ఈ మహమ్మారిని వాళ్లు కట్టడి చేసిన విధానంపై ప్రపంచ దేశాలు ప్రశంసల వర్షం కురిపించాయి.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







