తెలంగాణలో ముగిసిన కరోనా సెకండ్ వేవ్..
- August 18, 2021
హైదరాబాద్: 18 ఏళ్లు నిండిన వారంతా వ్యాక్సిన్ వేసుకోవాలని తెలంగాణ వైద్యశాఖ సూచించింది. వ్యాక్సిన్ తీసుకుంటేనే పబ్లిక్ ప్లేసుల్లో తిరగడానికి అనుమతిపై ప్రభుత్వం పరిశీలన చేస్తోందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.త్వరలో ఇంటింటికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ సెకండ్ వేవ్ ముగిసిందని ఆయన వివరించారు.కొవిడ్ చాలావరకు అదుపులోకి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జ్వరం వస్తే కొవిడ్ కారణంగానే సంక్రమించిందని అనుకోవద్దని ప్రజలకు సూచించారు.
జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భద్రాద్రి, ములుగు జిల్లాల్లో 340 మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.65 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించామని శ్రీనివాస రావు తెలిపారు.56 శాతం మందికి ఫస్ట్ డోస్, 34 శాతం మందికి రెండో డోస్ పూర్తయిందని చెప్పారు.GHMC ఏరియాలో 90 శాతం మంది ప్రజలకు మొదటి డోసు వేశామని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







