గల్ఫ్ వాపసీలు 'స్వదేస్' పథకాన్ని ఉపయోగించుకోవాలి
- August 19, 2021హైదరాబాద్: వందే భారత్ మిషన్ కింద వాపస్ వచ్చిన భారతీయ పౌరుల కోసం ప్రభుత్వం 'స్వదేస్' (స్కిల్డ్ వర్కర్స్ అరైవల్ డేటాబేస్ ఫర్ ఎంప్లాయిమెంట్ సపోర్ట్ - ఉద్యోగ మద్దతుకోసం నైపుణ్య వంతులైన కార్మికుల సమాచార సేకరణ) ను భారత ప్రభుత్వం ప్రారంభించిందని, కోవిడ్ సంక్షోభంలో గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన కార్మికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులైన బాపురావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గల్ఫ్ కార్మికులకు సహాయపడుతున్నందుకు బిజెపి నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో ఎంపీని కలిసి కృతజ్ఞతలు తెలిపి శాలువాతో సత్కరించారు.
విదేశాల నుండి వాపస్ వచ్చినవారు ఆన్లైన్ లో 'స్వదేస్' స్కిల్స్ కార్డ్ని పూరించాలి. ఇందులో వృత్తి, నైపుణ్యం, అనుభవం వివరాలను నమోదు చేయాలి. 'స్కిల్ కార్డ్' ద్వారా సేకరించిన సమాచారం స్కిల్ ఇండియా 'అసీం'(ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయీ ఎంప్లాయర్ మ్యాపింగ్) పోర్టల్తో అనుసంధానం చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలను సులభతరం చేయడానికి ఉపయోగించబడుతుందని ఈ సందర్బంగా నంగి దేవేందర్ రెడ్డి అన్నారు.
'స్వదేస్' నైపుణ్య కార్డు కోసం గల్ఫ్ కార్మికుల పేర్లు నమోదు చేయడానికి త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని దేవేందర్ రెడ్డి అన్నారు. గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన కార్మికులకు పునరావాసం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 'గల్ఫ్ బంధు' పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల