కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం జగన్ ఆత్మీయ ఆతిధ్యం

- August 19, 2021 , by Maagulf
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం జగన్ ఆత్మీయ ఆతిధ్యం

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మార్యాద పూర్వకంగా కలిశారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా తిరుపతి నుంచి విజయవాడ చేరుకున్న ఆయన ఏపీ సీఎం జగన్ ఆహ్వానం మేరకు తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కిషన్ రెడ్డి దంపతులను జగన్ సన్మానించారు. కిషన్ రెడ్డి దంపతులకు జగన్ లంచ్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయాలపైనా, రాష్ట్రానికి రావలసిన కేంద్ర నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించినట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com