బ్రేక్ ఫాస్ట్ విత్ కాన్సుల్ జనరల్: ఉమ్ అల్ కువైన్లో భారత అసోసియేషన్ కార్యక్రమం
- August 21, 2021
యూఏఈ: ఐదవ ఎడిషన్ ‘బ్రేక్ ఫాస్ట్ విత్ కాన్సుల్ జనరల్’, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, దుబాయ్, కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పురి, ఉమ్ అల్ కువైన్లోని భారత అసోసియేషన్ని ఆగస్ట్ 20న సందర్శించారు. శరవణ ఫుడ్ స్టఫ్ ఫ్యాక్టరీ ఎల్ఎల్సికి చెందిన భారత వర్క్ ఫోర్స్తో సమావేశమయ్యారు. ఉమ్ అల్ కువైన్ భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ సజాద్ సహీర్ నట్టిక, శరవణ ఫుడ్ స్టఫ్ ఫ్యాక్టరీ ఎల్ఎల్సి జనరల్ మేనేజర్ జుల్ఫికర్ అలి, దత్త యోగా సెంటర్ డాక్టర్ కె.ఎస్.ఎన్. కుమార్, బ్యాంక్ ఆఫ్ బరోడాకి చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫస్ట్ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ డే కూడా ఇదే రోజున నిర్వహించారు. కార్మికులు బ్రేక్ఫాస్ట్లో పాల్గొనడం పట్ల, వారితో సమావేశమవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు కాన్సుల్ జనరల్. కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని వారికి సూచించారు. యోగా సాధన ద్వారా అనేక మానసిక శారీరక సమస్యలకు దూరంగా వుండొచ్చని కూడా పేర్కొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ప్రతినిథులను, శరవణ ఫుడ్ స్టఫ్ ఫ్యాక్టరీ నిర్వాహకులను అభినందించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిథులు, కార్మికులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాఫిల్ డ్రాలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించారు. కాన్సుల్ జనరల్, ఇండియన్ అసోసియేషన్ ఉమ్ అల్ కువైన్ ప్రాంగణంలో మొక్కను నాటారు.



తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







