అఫ్గాన్ నుంచి దోహా మీదుగా స్వదేశానికి చేరుకుంటున్న ఇండియన్స్
- August 23, 2021
దోహా: అఫ్గాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా స్వదేశానికి చేర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.వీలైతే నేరుగా లేదంటే ఇతర దేశాల మీదుగా భారతీయులను తరలిస్తున్నారు.ఇందులో భాగంగా కాబూల్ నుంచి దోహాకు తరలించిన భారతీయుల్లో మొదటి బ్యాచ్ ను స్వదేశానికి తరలించారు.135 మందితో కూడిన విమానం దోహా నుంచి భారత్ కు వెళ్లినట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.కాబూల్ నుంచి నేరుగా భారత్ కు చేరుకునే అవకాశాలు సన్నగిల్లిన నేపథ్యంలో ముందుగా ఖతార్ కు తరలించిన అక్కడి నుంచి స్వదేశానికి పంపిస్తున్నారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం ఈ తరలింపు ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. గత శనివారం దోహా నుంచి ఇండియన్స్ బయల్దేరిన వీడియోను ట్వీట్ ద్వారా షేర్ చేసింది. భారతీయులను సురక్షితంగా తరలించేందుకు దోహదపడిన ఖతార్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలాఉంటే ఆగస్ట్ 22న అఫ్గాన్ నుంచి దాదాపు 500 మంది వివిధ గమ్యస్థానాల నుంచి భారత్ కు క్షేమంగా చేరుకున్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







