కొందరు వలసదారులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసిన సుప్రీం కమిటీ

- August 29, 2021 , by Maagulf
కొందరు వలసదారులకు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసిన సుప్రీం కమిటీ

మస్కట్: సెప్టెంబర్ నుంచి వ్యాక్సినేషన్ పొందని వలసదారులకు వీసా రెన్యువల్ కుదరదు. కనీసం ఒక్క డోసు అయినా వ్యాక్సినేషన్ పొందితే, అదీ ఒమన్ ఆమోదించిన వ్యాక్సిన్ తీసుకుంటేనే వీసా రెన్యువల్‌కి అవకాశం కల్పిస్తారు. అక్టోబర్ నుంచి మాత్రం రెండు వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసుకుంటేనే వీసా రెన్యువల్ కోసం వలసదారులకు అనుమతి లభిస్తుంది. కాగా, ఈ ఏడాది జారీ చేసిన వీసాలు ఈ ఏడాది చివరి వరకు గడువు పొడిగించబడతాయి, అదీ ఎలాంటి అదనపు రుసుము అవసరం లేకుండానే. ఈ విషయాన్ని మేజర్ జనరల్ అబ్దుల్లా బిన్ అలి అల్ మార్తి చెప్పారు. విదేశాల్లో వుండిపోయిన ఒమన్ రెసిడెంట్స్ తమ వీసాల గడువుని పొడిగించుకునేందుకు రాయల్ ఒమన్ పోలీస్ ఎలక్ట్రానిక్ పోర్టల్‌ని సందర్శించాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com