మెంటల్ హెల్త్కేర్ని ప్రారంభించిన పీఎం
- March 15, 2016
కమ్యూనిటీ బేస్డ్ మెంటల్ హెల్త్ సెంటర్ని ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మినిస్టర్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని ప్రారంభించారు. హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి) ఈ సెంటర్ని ఏర్పాటు చేసింది. పిల్లలకు సైకలాజికల్ సపోర్ట్ని మరియు హెల్త్ కేర్ని అందించేలా ఈ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మహిళలకు డే కేర్ ప్రోగ్రామ్ని ప్రత్యేకించి 18 ఏళ్ళు దాటిన మహిళల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభాగంలో పూర్తిగా మహిళలే పనిచేయనున్నారు. మానసిక రుగ్మతలు సమాజంలో ఎక్కువవుతుండడంతో, అలాంటివారికి చికిత్స అందించేందుకు ఇలాంటి చికిత్సనందించే హాస్పిటల్స్ మరిన్ని రావాలని ప్రైమ్ మినిస్టర్ ఆకాంక్షించారు. మానసిక సమస్యలకు చికిత్సను అందించడమే కాకుండా, మానసిక సమస్యల్ని ముందస్తుగా గుర్తించి, నివారించేందుకూ తగిన విధంగా పలు ఏర్పాట్లు ఈ ఆసుపత్రిలో ఉన్నాయని హమాద్ మెడికల్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









