మెంటల్ హెల్త్కేర్ని ప్రారంభించిన పీఎం
- March 15, 2016
కమ్యూనిటీ బేస్డ్ మెంటల్ హెల్త్ సెంటర్ని ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మినిస్టర్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని ప్రారంభించారు. హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి) ఈ సెంటర్ని ఏర్పాటు చేసింది. పిల్లలకు సైకలాజికల్ సపోర్ట్ని మరియు హెల్త్ కేర్ని అందించేలా ఈ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో మహిళలకు డే కేర్ ప్రోగ్రామ్ని ప్రత్యేకించి 18 ఏళ్ళు దాటిన మహిళల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభాగంలో పూర్తిగా మహిళలే పనిచేయనున్నారు. మానసిక రుగ్మతలు సమాజంలో ఎక్కువవుతుండడంతో, అలాంటివారికి చికిత్స అందించేందుకు ఇలాంటి చికిత్సనందించే హాస్పిటల్స్ మరిన్ని రావాలని ప్రైమ్ మినిస్టర్ ఆకాంక్షించారు. మానసిక సమస్యలకు చికిత్సను అందించడమే కాకుండా, మానసిక సమస్యల్ని ముందస్తుగా గుర్తించి, నివారించేందుకూ తగిన విధంగా పలు ఏర్పాట్లు ఈ ఆసుపత్రిలో ఉన్నాయని హమాద్ మెడికల్ కార్పొరేషన్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







