ఒమన్లో ఈ ఏడాది జీతాల పెరుగుదల ఇలా
- March 15, 2016
ఒమన్ మరియు జిసిసి దేశాల్లో ఈ ఏడాది జీతాల పెరుగుదల గడచిన పదేళ్ళతో పోల్చితే తక్కువే ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. యూఏఈలో ఒపొఫెషనల్స్ 5.3 శాతం పెరుగుదల నమోదు చేసే అవకాశం ఉంది. ఖతార్ 4.7 శాతంతోనూ, కువైట్, ఒమన్లలో 4.6, 4.4 శాతం పెరుగుదల ఉండవచ్చు. అయితే, ఖర్చులు రెండింతలు పెరగడంతో సేలరీ ఇంక్రీజ్ అనేది చాలా తక్కువగా ఉండటం పట్ల ప్రొఫెషనల్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల సంక్షోభంతో గల్ఫ్ దేశాల్లో సబ్సిడీలు ఎత్తివేయడం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపింది. గల్ఫ్ వ్యాప్తంగా 700 మంది యజమానులు, 25,000 మంది ప్రొఫెషనల్స్ని సర్వే చేసి, పరిస్థితుల్ని అంచనా వేశారు. ఈ అంచనాల ప్రకారం 2016లో సేలరీ ఇంక్రీజ్ అనేది 5.2 వరకూ ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది. పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా, ముడిచమురుపై ఆధారపడ్డ ఇతర దేశాలతో పోల్చితే గల్ఫ్ దేశాల్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని నిపుణులు చెప్పారు. కంపెనీలు పెరుగుతున్నా, వాటిల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుండడానికి కారణం ఈ సంక్షోభమే.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







