విదేశాల నుంచి కువైట్ వచ్చిన ప్రయాణికుడికి కోవిడ్ పాజిటివ్
- September 06, 2021
కువైట్: డెల్టా వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి పీసీఆర్ టెస్టులో కోవిడ్ పాజిటీవ్ గా గుర్తించారు. కోవిడ్ నివారణ కమిటీ అధిపతి డాక్టర్ ఖలీద్ అల్-జరాల్లా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం అన్ని దేశాల నుంచి కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయని, కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి కూడా విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కువైట్ వచ్చే ప్రతి ప్రయాణికుడికి పీసీఆర్ టెస్ట్ నిర్వహణ చాలా కీలకం అని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అలక్ష్యం చేస్తే కువైట్లోనూ కొత్త వేరియంట్లకు చోటు ఇచ్చినట్లు అవుతుందన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుడికి పీసీఆర్ టెస్టులో కోవిడ్ పాజిటీవ్ రావాటాన్ని నిదర్శనంగా పేర్కొన్నారు. అయితే..పాజిటీవ్ గా నిర్ధారణ అయిన వ్యక్తి ప్రవాసీయుడు కాదని, ఈజిప్ట్ నుంచి వచ్చిన కువైట్ పౌరుడని ఆయన తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్









