విదేశాల నుంచి కువైట్ వచ్చిన ప్రయాణికుడికి కోవిడ్ పాజిటివ్
- September 06, 2021
కువైట్: డెల్టా వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి పీసీఆర్ టెస్టులో కోవిడ్ పాజిటీవ్ గా గుర్తించారు. కోవిడ్ నివారణ కమిటీ అధిపతి డాక్టర్ ఖలీద్ అల్-జరాల్లా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం అన్ని దేశాల నుంచి కువైట్ కు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయని, కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి కూడా విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కువైట్ వచ్చే ప్రతి ప్రయాణికుడికి పీసీఆర్ టెస్ట్ నిర్వహణ చాలా కీలకం అని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అలక్ష్యం చేస్తే కువైట్లోనూ కొత్త వేరియంట్లకు చోటు ఇచ్చినట్లు అవుతుందన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుడికి పీసీఆర్ టెస్టులో కోవిడ్ పాజిటీవ్ రావాటాన్ని నిదర్శనంగా పేర్కొన్నారు. అయితే..పాజిటీవ్ గా నిర్ధారణ అయిన వ్యక్తి ప్రవాసీయుడు కాదని, ఈజిప్ట్ నుంచి వచ్చిన కువైట్ పౌరుడని ఆయన తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!







